Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగాన్వేష్, కృతిక జంటగా ఫిల్మ్స్ పతాకంపై జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం 'వినవయ్యా రామయ్యా'. ఈ చిత్రం విడుదలై యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్లో వేడుక చేసుకుంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ, 'నాగాన్వేష్ నటనపై టైనింగ్ తీసుకుని సూపర్గా నటించాడు. డాన్సులు బాగా చేశాడు. ఈ చిత్రం మా థియేటర్లోనే యాభై రోజులు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు. 'ఈ చిత్రం వైజాగ్లోని వి మ్యాక్స్ థియేటర్లో విజయవంతంగా యాభై రోజులు ప్రదర్శింప బడింది. చిన్న సినిమాలకు థియేటర్లే దొరకని పరిస్థితులో మా సినిమా యాభై రోజులు ఆడడం గొప్ప విషయం' అని నిర్మాత తెలిపారు. నాగాన్వేష్ మాట్లాడుతూ, 'సినిమా విడుదలై హిట్ అయినప్పటి కంటే యాభై రోజుల సెలబ్రేషన్ చేసుకోవడం ఎక్కువ ఆనందంగా ఉంది. ఈ సినిమా తర్వాత నాతో చేయడానికి చాలా మంది దర్శకులు వస్తున్నారు. తెలుగులో రెండు, తమిళ్లో ఓ చిత్రానికి సైన్ చేశాను' అని చెప్పారు. 'వినాయక్ గారు అన్నట్లుగానే యాభై రోజులు ఆడిన ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని దర్శకుడు రామ్ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, మారుతి, కె.ఎస్.రామారావు, కృతిక తదితరులు పాల్గొన్నారు.