Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్వకుంట్ల తేజేశ్వర్ రావు(కన్నారావు) నిర్మాతగా పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'షీ'. 'ఈజ్ వెయిట్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం నిర్మాత తేజేశ్వర్రావు తన పుట్టిన రోజును చిత్ర యూనిట్ మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'అత్యున్నత సాంకేతిక విలువలతో సరికొత్త కథాంశంతో రొటీన్ చిత్రాలకు భిన్నంగా నిర్మిస్తున్న 'షీ' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను' అని అన్నారు. 'దెయ్యం పట్టిందని చాలా మంది చెబుతుంటే వింటుంటాం. మా సినిమాలో హీరో తనకే దెయ్యం పట్టా లని విచిత్రంగా ఆలోచిస్తుంటాడు. అలాంటి యువకుడికి దెయ్యం పడితే, అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే ఇతివృత్తంతో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కి స్తున్నాం. నవతరం మనోభావాలకు దర్పణంలా ఈ సినిమా ఉంటుంది. వినోదం, ప్రేమ, యాక్షన్, కుటుంబ అనుబంధాల మేళవింపుతో అన్ని కమర్షియల్ హంగులున్న చిత్రమిది. ప్రముఖ మలయాళ నటి టైటిల్ రోల్ పోషించనుంది. దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. రెండు షెడ్యూల్స్లో పూర్తి చేసి మార్చిలో సినిమాను విడుదల చేస్తాం' అని దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర చెప్పారు.