Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శ కత్వంలో మేఘన ఆర్ట్స్ పతాకంపై పి.వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం దసరా పండుగ సందర్భంగా గురువారం హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లా డుతూ, ''టైగర్' చిత్రంతో విజయం సాధించి, స్క్రీన్ప్లే పరంగా కొత్త దనాన్ని ఆవిష్కరించిన వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. అలాగే 'స్వామి రారా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్ సూర్య' వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకున్న నిఖిల్ 'శంకరాభరణం' తర్వాత నటిస్తున్న చిత్రమిది. తనదైన శైలిలో సరికొత్త కథలని ఎంచుకునే నిఖిల్ ఈ చిత్రకథని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేయడం విశేషం. సాయి శ్రీరాం, అబ్బూరి రవి, శేఖర్ చంద్ర, ఛోటా.కె ప్రసాద్ వంటి సక్సెస్ఫుల్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. హీరోయిన్తోపాటు ఇతర నటీనటులను త్వరలోనే ఎంపిక చేసి, నవంబర్ నెలాఖరులో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం' అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరాం, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం:శేఖర్ చంద్ర, ఆర్ట్: ఎ.రామాంజనేయులు.