Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గిడ్డేష్, కిరణ్, సమీరా, సుమిగోష్ ప్రధాన పాత్రధారులుగా శేఖర్ చంద్ర దర్శకత్వంలో కె.యస్.ఎల్.ఫిలింస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కరె శ్రీనివాస్ నిర్మిస్తున్న 'వజ్రాల వేట' చిత్రం విజయదశమి సందర్భంగా సారధి స్టూడియోలో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి క్లాప్నివ్వగా, నిర్మాత డి.యస్.రావు కెమెరా స్విచాన్ చేశారు. సాయి వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'ఒకేసారి వేలకోట్లు సంపాదించడం కోసం హీరో హీరోయిన్లు, విలన్లు అడవికి వెళ్లిన నేపథ్యంలో జరిగే పరిణామాల క్రమమే ఈ చిత్రం' అని అన్నారు. 'ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రంలో నల్లమల అటవీ రోప్స్, ఛేజింగ్స్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మాస్, అడ్వెంచరస్, హర్రర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో లవ్, రొమాంటిక్, కామెడీ సన్నివేశాలు ఉల్లాసభరితంగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తాయి' అని నిర్మాత తెలిపారు.