Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీషా సింగ్, అనుకృతి శర్మ, మహబూబ్ మన్సూర్ ప్రధాన పాత్ర ధారులుగా శివనాగు దర్శకత్వంలో విజయసారధి విజువల్స్, విజయ సారధి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సయ్యద్ అల్లాబక్షు నిర్మిస్తున్న చిత్రం 'జంక్షన్లో జయమాలిని'. ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్లోని సారధి స్టూడియోస్లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి సీనియర్ జర్నలిస్ట్ వినాయక్రావు క్లాప్ కొట్టగా, వై.అశోక్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. కె.ఎస్.నాగేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'ఈ నెల 26 హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాం. సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. 'దర్శకుడు నెరేట్ చేసిన లేడీ ఓరియెంటెడ్ కథ నచ్చడంతో నిర్మాతగా మారాను. మా అబ్బాయి మన్సూర్ను హీరోగా పరిచయం చేస్తున్నాం. ఇందులో ఐదు పాటలున్నాయి' అని సయ్యద్ అల్లాబక్షు తెలిపారు. మన్సూర్ మాట్లాడుతూ, 'ప్రేమ, కుటుంబం, యాక్షన్ అంశాలతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని అన్నారు.