Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య హీరోహీరోయిన్లుగా కిషన్ సాగర్.ఎస్ దర్శకత్వంలో లాస్ ఏంజిల్స్ టాకీస్, సంధ్యా సినీ స్టూడియోస్పై అల్లూరి సూర్య ప్రసాద్, సంధ్యారవి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మౌనం'. 'వాయిస్ ఆఫ్ సైలెన్స్' అనేది ట్యాగ్లైన్. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇదొక డిఫరెంట్ జోనర్లో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్. ఈ చిత్రానికి బ్య్రాగ్రౌండ్ స్కోర్ కీలకమైంది.
ఇటువంటి వైవిధ్యమైన చిత్రాలకు సంగీత దర్శకురాలు శ్రీలేఖ న్యాయం చేస్తారని భావించి ఆమెను అప్రోచ్ అయ్యాం. కథ విన్న తర్వాత ఎంతో ఎగ్జైటై సంగీతమందించడానికి శ్రీలేఖ ముందుకొచ్చారు. అలాగే 'శివ' ఫేమ్ చిన్నా ఓ అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా జాతీయ అవార్డు పొందిన కిషన్ సాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. త్వరలో కొలంబోలో పాటలను షూట్ చేయనున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి కథ: అనిల్ కె. నాని. కథనం, మాటలు,
కూర్పు:శివ శర్వాణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బలుసు రామారావు.