Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రాఫిక్స్, ఎడిటింగ్ వంటి అంశాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ శ్రీ మేఘ స్టూడియో రూపొందింది. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ స్టూడియోను అతిథిగా విచ్చేసిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియో అధినేత వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, 'గతంలో ఇండిస్టీలో మేనేజర్గా పనిచేశాను. ఆ అనుభవంతో ఈ స్టూడియోను అత్యాధునిక హంగులతో ప్రారంభించాం. నా మిత్రుడు కొండ్రెడ్డి సతీష్ నిర్మాతగా నిర్మిస్తున్న 'వాడు వీడు ఓ కల్పన' చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో ఈ స్టూడియో ప్రారంభం అవ్వడం సంతోషంగా ఉంది. మా ఆహ్వానం మేరకు స్టూడియోని ప్రారంభించడానికి విచ్చేసిన మంత్రి తలసానిగారికి కృతజ్ఞతలు' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్, హీరో శివ, మేఘశ్రీ, నిర్మాత సతీష్ కొండ్రెడ్డి, నవీన్ యాదవ్, పద్మిని, టెక్నికల్ హెడ్ మహి.కె. మహేష్ తదితరులు పాల్గొన్నారు.