Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అత్తాఫ్ హైదర్, యం.డి.ఖాదర్ ఘోరి, రహీమ్, ఫరాఖాన్, అలీఫాలు హీరో హీరోయిన్లుగా ఎస్.కె.మశి దర్శకత్వంలో ఎస్.కె.యం. ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఆలిండియా కృష్ణమహేష్ ప్రజాసేన అధ్యక్షులు యం.డి.ఖాదర్ ఘోరి, యం.డి.అఫ్సర్లు సంయుక్తంగా తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం 'బంగ్లాలో అలజడి'.
ఇటీవల ఈ చిత్రం షాద్నగర్లోని నాగులపల్లి రిసార్ట్లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి షాద్ నగర్ ఎమ్మెల్యే ఎ.అంజయ్య యాదవ్ క్లాప్నివ్వగా, జిల్లా జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు జి.శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 'ఈ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించి, ఇక్కడే చిత్రీకరణ జరపాలనుకోవడం సంతోషంగా ఉంది' అని అన్నారు. 'హర్రర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను మార్చి నుంచి ప్రారంభిస్తాం. విజయవాడ, విశాఖలలో కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇందులో ఐదు పాటలుంటాయి' అని దర్శకుడు ఎస్.కె.మశి తెలిపారు. యం.డి.ఖాదర్ మాట్లాడుతూ, 'సినిమాలపై ఉన్న ప్యాషన్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో నేనొక హీరోగా నటించడం చాలా హ్యాపీగా ఉంది' అని అన్నారు.