Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాలీవుడ్లో విడుదలైన 'ప్రేమమ్' చిత్రంతో దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా మారిన అనుపమా పరమేశ్వరన్ తాజాగా ధనుష్తో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. దురై సెంథిల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కొడి' చిత్రంలో ధనుష్ సరసన హీరోయిన్గా ఎంపికయ్యింది. ముందుగా ఈ చిత్రంలో ధనుష్ సరసన షామిలీని ఎంపిక చేశారు. పలు తమిళ ప్రాజెక్టుల్లో నటిస్తూ షామిలీ బిజీగా ఉండడం తో డేట్స్ సమస్య కారణంగా అనుపమా పరమేశ్వరన్ని తీసుకున్నారని సమాచారం.
పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తూ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ తాజాగా తెలుగులో 'ప్రేమమ్' రీమేక్గా తెరకెక్కిస్తున్న 'మజ్ను'లో నాగచైతన్య సరసన నటిస్తోంది. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందనున్న 'ఎన్మెల్ పాయుమ్ తోట' చిత్రంతోపాటు 'ద ఫకీర్' అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తూ ధనుష్ బిజీగా ఉన్నారు.