Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రస్తుతం బాలీవుడ్లో మంచి రోజులు కొనసాగుతున్నాయని అనిపిస్తోంది. ఈ కాలం ప్రేక్షకులు వాణిజ్య పరమైన చిత్రాలతోపాటు కళాత్మక చిత్రాలను కూడా చూసేందుకు ఇష్టపడుతున్నార'ని బాలీవుడ్ నటి షబానా అజ్మీ పేర్కొన్నారు. 70,80 దశకాల్లో అగ్రకథానాయికగా బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన షబానా తాజాగా 'చాక్ అండ్ డస్టర్', 'నీరజ' చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,'ఈ మధ్య బాలీవుడ్లో అన్ని రకాల సినిమాలు తీస్తున్నారు. వీటితోపాటు పూర్తి మసాలా సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయి. అలాగే 'మసాన్', 'జిందగీ నా మిలేగి దొబారా' వంటి కళాత్మక చిత్రాలూ వచ్చాయి. వీటి ద్వారా ప్రేక్షకుడు తనకి నచ్చిన సినిమా చూసుకునే అవకాశాన్ని సినిమాలు కల్పిస్తున్నాయి' అని చెప్పారు.