Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మళయాళ అగ్రనటుడు మమ్ముట్టి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్, మణిరత్నం, ఏ.ఆర్.రెహ్మాన్, పి.సి. శ్రీరాం వంటి హేమాహేమీల కాంబినేషన్లో త్వరలోనే ఓ మళయాళ చిత్రం రానుండటం విశేషం. ఇటీవల మమ్ముట్టిని కలిసి మణిరత్నం కథ నెరేట్ చేశారు. కథ బాగుండటంతో మమ్ముట్టి కూడా నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చారట. ఈ చిత్రంలో కథానాయికగా నటించమని ఐశ్వర్య రారుని ఇటీవల మమ్ముట్టి సంప్రదించారట. ఐష్ కూడా అందుకు సుముఖంగానే ఉందని సమాచారం. ఇదంతా ఓ విశేషమైతే ఏఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతమందించడం, కెమెరామెన్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయడం ఇంకొక విశేషం. ఇలాంటి హేమాహేమీలు కలిసి చేయనున్న ఈ చిత్రంపై ఇప్పటికే విపరీ తమైన క్రేజ్ నెలకొంది. అన్ని కుదిరితే వచ్చే ఎడాది జూలైలో సెట్స్పైకి వెళ్లనుందీ చిత్రం. గతంలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన బ్లాక్బాస్టర్ హిట్ 'దళపతి' చిత్రంలో మమ్ముట్టి నటించిన సంగతి తెలిసిందే. ఇందులో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు. ఆ తర్వాత మణిరత్నం 'ఇరువర్' చిత్రం కోసం మమ్ముట్టిని కలవగా ఆ కథ తనకు సెట్ అవ్వదని తిరస్కరించిన సంగతి విదితమే.