Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను ఎప్పటికైనా దర్శకత్వం వహిస్తాను. కానీ ఎప్పుడు దర్శకత్వం వహించినా ఆ సినిమా మాత్రం మాస్టర్పీస్లా ఉండాలనుకుంటా' అని అంటున్నారు హీరో సచిన్ జోషి. తాతినేని సత్య దర్శకత్వంలో సచిన్ జోషి హీరోగా, ఈషా గుప్తా కథానాయికగా రూపొందిన చిత్రం 'వీడెవడు'.
ఈ నెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో సచిన్ జోషి ఇటీవల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
స్క్రీన్ప్లే హైలైట్గా..
ఇది క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం. లవ్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ అంశాల సమాహారంగా కొత్తగా, డిఫరెంట్గా ఉంటుంది. ప్రేక్షకులు చూసేటప్పుడు ఎగ్జైటింగ్గా ఫీలవుతారు. ఓ భిన్నమైన చిత్రాన్ని చూశామన్న అనుభూతి పొందుతారు. చాలా సినిమాలకు కథ ఒకేలా ఉన్నప్పటికీ దాన్ని ఎలా ప్రజెంట్ చేశామనేది ముఖ్యం. ఇది స్క్రీన్ప్లే ప్రధానంగా సాగే చిత్రం. ఓ కొత్తరకమైన స్క్రీన్ప్లేతో రూపొందించాం. ఇలాంటి స్క్రీన్ప్లేను నేనింత వరకూ చూడలేదు. విజువల్గానూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. బ్యాక్గ్రౌడ్ స్కోర్కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
నేనెవరనేది ఆసక్తికరం..
ఇందులో స్పోర్ట్స్ అనేది కేవలం బ్యాక్డ్రాప్ మాత్రమే, కాని ఓ పాత్ర కీలకంగా ఉంటుంది. నేను కబడ్డీ క్రీడా కారుడిగా కనిపిస్తాను. నేను దొంగనా, మంచివాడినా, హంతకుడినా... అసలు వీడెవడు అనేది తెలియాలంటే వెండితెరపైనే చూడాలి. కబడ్డీ ఆటగాడి పాత్ర కోసం ప్రో కబడ్డీ ఆడుతున్న నిజమైన ప్లేయర్స్తో కలిసి మూడు వారాల పాటు శిక్షణ తీసుకున్నా. కబడ్డీ ఆటలోనే అంతర్లీనంగా యాక్షన్ అంశాలను చూపించడానికి చాలా కష్టపడ్డాం. క్లైమాక్స్ సన్నివేశాలు అలరిస్తాయి. నా పాత్రలో మల్టీఫుల్ పర్సనాలిటీస్ ఉంటే, హీరోయిన్ ఈషా గుప్తాలో రెండు పర్సనాలిటీస్ ఉంటాయి. ఆమె కూడా చాలా బాగా చేసింది.
టాలెంటెడ్ దర్శకుడు సత్య..
దర్శకుడు తాతినేని సత్య మంచి టాలెంటెడ్ దర్శకుడు. ఆరేడుగురు రచయితలతో కలిసొచ్చి ఈ సినిమా గురించి చెప్పారు. ఇదొక ఫిక్షన్ స్టోరీ. దర్శకుడు దాన్ని అంతే బాగా తెరపై ఆవిష్కరించారు. ప్రతి దర్శకుడికి ఒక్కో రకమైన ప్రతిభ ఉంటుంది. అలానే సత్య సినిమాను తెరపై ఆవిష్కరించే తీరు అమేజింగ్గా ఉంటుంది. మర్డర్ మిస్టరీను ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇది పూర్తిగా టీమ్ ఎఫర్ట్తోనే సాధ్యమైంది. నిజాయితీతో చేసిన చిత్రమిది. ఈ నెల 15న తెలుగు, తమిళంలో విడుదలయ్యే ఈ చిత్రం కచ్చితంగా అన్ని వర్గాలను ఆలరిస్తుంది. యూనివర్సల్ కంటెంట్తో ఉన్న ఈ చిత్రం ఏ ఇండిస్టీ ప్రేక్షకులకైనా నచ్చుతుంది.
విమర్శలను పట్టించుకోను..
ఇన్నేండ్ల నా కెరీర్లో 9 సినిమాలు చేశాను. వాటిలో మూడు సినిమాలను మాత్రమే నిర్మించాను. మంచి కథలు కావడంతోనే నిర్మాతనయ్యాను. ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారింది. కొత్త తరహా కథాంశాల్ని మాత్రమే ఆదరిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్స్ మరింత మంది ఇండిస్టీకి రావాలి. అప్పుడే కథా బలమున్న సినిమాలొస్తారు. ప్రస్తుతం ఇండిస్టీలో తపనతో సినిమాలు చేసేవారు ఒకరిద్దరు తప్పితే ఎక్కువగా కనిపించడం లేదు. రెమ్యూనరేషన్కే ప్రయారిటీ ఇస్తున్నారు. నేను డబ్బు కోసం కాకుండా ఇష్టంతో సినిమాలు చేస్తున్నా. నాపై వస్తున్న విమర్శల్ని పట్టించుకోను. భవిష్యత్లో నేను కచ్చితంగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తా. అది తీసేముందు దాని గురించి నేనింకా బాగా నేర్చుకోవాలి. ప్రస్తుతం ఆ పనిలో ఉన్నా, ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ నేను ఎప్పుడూ సినిమా తీసినా అదొక మాస్టర్ పీస్లాగా ఉండాలనుకుంటాను.