Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం విదితమే. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన మూడోసారి నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కుంభకోణంలో జరుగుతుంది. ఆ విశేషాలను నిర్మాత సి.కళ్యాణ్ తెలియజేస్తూ, 'సెన్సేషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102వ చిత్రాన్ని మా బ్యానర్లో నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. భారీ బడ్జెట్తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఎం.రత్నం ఈ చిత్రానికి అద్భుతమైన కథ అందించారు. 'శ్రీరామరాజ్యం', 'సింహా' వంటి బ్లాక్ బస్టర్స్ అనంతరం బాలకృష్ణ సరసన నయనతార నటించడం విశేషం. మరో నాయికగా నటాషా దోషిని ఎంపిక చేశాం. రాంప్రసాద్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రానికి సంగీత సారథ్యం వహించి చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా సంగీత సమకూరుస్తుండటం మరో విశేషం. రామోజీ ఫిల్మ్సిటీలో భారీ సెట్ నిర్మించి ఆగస్టు 3 నుంచి 30 రోజులపాటు చిత్రీకరణ జరిపాం. తాజా షెడ్యూల్ కుంభకోణంలో జరుపుతున్నాం. ఆదివారం నుంచి బాలకృష్ణ షూటింగ్ పాల్గొంటుండగా, పలు కీలక సన్నివేశాలతోపాటు పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నాం. ఈ షూటింగ్లో ప్రధాన తారాగణం అంతా పాల్గొంటుంది. ప్రకాష్రాజ్, మురళీ మోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులు ముఖ్యంగా బాలయ్యబాబు అభిమానులను ఈ చిత్రం మెస్మరైజ్ చేస్తుంది' అని చెప్పారు.