Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరో, హీరోయిన్లుగా పాండిరాజ్ దర్శకత్వంలో టి.రాజేందర్ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్, జేసన్రాజ్ ఫిల్మ్స్ పతాకాలపై టి.రాజేందర్ నిర్మించిన చిత్రం 'సరసుడు'. తెలుగు, తమిళంలో బైలింగ్వల్గా రూపొందిన ఈ చిత్రం తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ నెల 15న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత టి.రాజేందర్ మాట్లాడుతూ, 'నేను రూపొందించిన 'ప్రేమ్సాగర్' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. అప్పట్నుంచి నన్ను బాగా గుర్తుపెట్టుకున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్. స్టార్ హీరోనా, చిన్న హీరోనా, పెద్ద బడ్జెట్ సినిమానా, చిన్న బడ్జెట్ సినిమానా అని చూడరు. సబ్జెక్ట్ బాగుంటే ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా. 'మన్మథ', 'వల్లభ' చిత్రాల తర్వాత శింబు, నయనతార కలిసి నటించిన చిత్రమిది. ఈ చిత్రానికి మా రెండో కుమారుడు కురళ్ సంగీతం అందించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా వచ్చింది. పాటలన్ని వేటికవే భిన్నంగా ఉంటాయి. ఈ చిత్రాన్ని నేను నిర్మించడమే కాకుండా పాటలు కూడా రాశాను. హీరో, హీరోయిన్లు సెల్ఫోన్లో మాట్లాడుకునే టైమ్లో వచ్చే పాటను యూత్కి నచ్చేలా రాశాను. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాం. తమిళంలో విడుదలై పెద్ద విజయం సాధించింది. తెలుగులో కూడా 'మన్మథ', 'వల్లభ' కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. సినిమాపై నమ్మకంతో, తెలుగు ప్రేక్షకులపై నమ్మకంతో తెలుగులో అన్ని ఏరియాల్లోనూ సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. 'కుర్రాడు వచ్చాడు' తర్వాత మా శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై న్ట్రయిట్గా రిలీజ్ చేస్తున్న చిత్రమిది. ఈ నెల 15న విడుదల కానున్న ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.