Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు దశబ్దాలకుపైగా ఆడియో రంగంలో అగ్రగామిగా రాణిస్తున్న ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ఉమేష్ గుప్తా తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కార్తీ, రకుల్ ప్రీత్ జంటగా హెచ్.వినోద్ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న 'ధీరన్ అదిగారమ్ ఒండ్రు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు 'ఖాకి' పేరుతో అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా మాట్లాడుతూ, 'కార్తీ నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇందులో కార్తీ శక్తివంతమైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. లుక్స్, ఫిజిక్ పరంగా ఆయన చాలా కేర్ తీసుకున్నారు. 2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు వినోద్ అద్భుతమైన కథ సిద్ధం చేశారు.
కథ వినగానే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని రైట్స్ తీసుకున్నాం. తెలుగులో 'రన్ రాజా రన్', 'జిల్', 'బాబు బంగారం', 'హైపర్' తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన జిబ్రాన్ ఈ సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అతి త్వరలో చిత్ర టీజర్ను, పాటలను, ఆ తర్వాత సినిమాను విడుదల చేస్తాం' అని అన్నారు.