Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పొల్లాచిలో జరుగుతోంది. ఆ విశేషాలను నిర్మాత అభిషేక్ నామా తెలియజేస్తూ, 'బలమైన కథ, కథనాలతో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో రూపొందిస్తున్న చిత్రమిది. శ్రీవాస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ల కాంబినేషన్లో ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజాగా పొల్లాచిలో 15 రోజుల భారీ షెడ్యూల్ చేశాం. ఇందులో పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ను చిత్రీకరించాం. అందుకోసం మా ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ సారథ్యంలో విండ్ టర్బైన్స్తో కలిసి ఓ భారీ సెట్ రూపొందించాం. బెల్లంకొండ ఎలాంటి డూప్ లేకుండా ఈ ఫైట్ సీక్వెన్స్లో పాల్గొన్నారు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు కీలకంగా ఉంటుంది' అని అన్నారు. జగపతిబాబు, శరత్కుమార్, మీనా, వెన్నెలకిషోర్, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్.