Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్బాబు, రకుల్ ప్రీత్సింగ్ జంటగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'స్పైడర్'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ త్వరలో హైదరాబాద్లో జరుగనుంది. ఆ విశేషాలను చిత్ర బృందం తెలియజేస్తూ, 'ఇటీవల చెన్నైలో విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. హేరిస్ జయరాజ్ సంగీతం అందించిన పాటలన్నీ శ్రోతలను బాగా ఆలరిస్తున్నాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ను ఈ నెల 15న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించనున్నార. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చే అభిమానుల సమక్షంలో ఈ ఫంక్షన్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చిత్ర ట్రైలర్ను కూడా విడుదల చేయనున్నార. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో దసరా కానుకగా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నార' అని తెలిపింది.