Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లరి నరేష్, నిఖిలా విమల్ జంటగా ప్రజిత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం 'మేడ మీద అబ్బాయి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వస్తోన్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అల్లరి నరేష్ మాట్లాడుతూ, 'నేను పేరడీలు లేకుండా చేసిన చిత్రమిది. కామెడీ ఎంత ఉండాలో, ఎక్కడ ఉండాలో చూసుకుని చేశాం. సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మహిళలకు, పిల్లలకు సినిమా బాగా నచ్చుతుంది. అలాగే సైబర్ క్రైమ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ చిత్రంలో చెప్పాం. హాస్యనటులు చాలా బాగా చేశారు. మొదటిసారి ఈ చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్లను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సినిమాలు నా కోసం కాకపోయినా నిర్మాత చంద్రశేఖర్గారి కోసం ఆడాలి. ఆయనలాంటి నిర్మాతలు ఇండిస్టీకి అవసరం. సినిమాను మరింత పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'ఇదొక డిఫరెంట్ ఫిల్మ్. రిజల్ట్పై సంతృప్తిగా ఉన్నాం. మొదట్లో ఎలా ఉన్నా రెండు, మూడు రోజుల తర్వాత సినిమా బాగుందని అంటున్నారు. ఈ చిత్రంలో నటించడంతో నరేష్ కథల ఎంపికలో మార్పు కనిపిస్తుంది. ఇందులో ఛాలెంజింగ్ నటించారు. మంచి హ్యూమర్ పండించారు. సినిమా కమర్షియల్గా బాగా ఆడుతోంది' అని శ్రీనివాస్ అవసరాల తెలిపారు. ఆది చెబుతూ, 'నరేష్ ఇందులో చాలా సెటిల్డ్గా నటించారు. సినిమాలో మంచి సందేశం కూడా ఉంది. అది మహిళలకు బాగా కనెక్ట్ అవుతుంది. హాస్యాన్ని, ట్విస్టులను బాగా ఎంజారు చేస్తున్నారు. సినిమా స్లో పాయిజన్లాగా ఎక్కుతోంది' అని చెప్పారు. 'సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని నిర్మాత చంద్రశేఖర్ చెప్పారు.