Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'. ఇటీవల ఈ చిత్ర షూటింగ్లో భాగంగా హీరో మంచు విష్ణు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. గాయాల నుంచి త్వరగా కోలుకున్న విష్ణు మళ్ళీ షూటింగ్ పాల్గొన్నారు. ఆ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ, 'ఈ చిత్రంలో భాగంగా యాక్షన్ సీక్వెన్ను తెరకెక్కిస్తుండగా బైక్ స్కిడ్ అవ్వడంతో విష్ణు, కథానాయిక ప్రగ్యా గాయాలపాలయ్యారు. ప్రగ్యా చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకోగా, మంచు విష్ణుకు మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో మలేషియాలో మొదలైన సెకండ్ షెడ్యూల్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. యాక్సిడెంట్ గాయాలను సైతం లెక్కచేయకుండా విష్ణు చాలా త్వరగా రికవరీ అయ్యారు. దీంతో షూటింగ్ను రీస్టార్ట్ చేశాం. త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ ప్రారంభించనున్నాం. ఇందులో విష్ణు, బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలుస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమవుతుంది' అని అన్నారు.