Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేదా థామస్ హీరోహీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం 'జై లవకుశ'. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రమిది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత కళ్యాణ్రామ్ మాట్లాడుతూ, 'వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ హీరోగా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. అన్నదమ్ముల మధ్య నడిచే బలమైన కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అలాగే ఎన్టీఆర్ మూడు పాత్రల్లో అదరగొట్టబోతున్నాడు. ఇటివలే విడుదల చేసిన ట్రైలర్కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. కేవలం 38 గంటల్లో కోటికిపైగా వ్యూస్ను పొందింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 'యు/ఏ' సర్టిఫికెట్ వచ్చింది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మించిన ఈచిత్రాన్ని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరామెన్: చోటా కె.నాయుడు, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.