Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ కథానాయకుడు శత్రుఘ్న సిన్హా తనయగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతోపాటు స్టార్ హీరోయిన్గా అందరి ప్రశంసల్ని సొంతం చేసుకుంది సోనాక్షి సిన్హా. 2010లో సల్మాన్ ఖాన్ సరసన నటించిన 'దబాంగ్' చిత్రం విడుదలై ఇటీవల ఏడేండ్లు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా సోనాక్షి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ''దబాంగ్'కు ఏడేండ్లు. సోనాక్షి కెరీర్కీ ఏడేండ్లు. తొలి చిత్రంతో అదిరిపోయే హిట్ అందించిన సల్మాన్ఖాన్కి, అర్బాజ్ ఖాన్, అభినవ్ కశ్యప్కు ధన్యవాదాలు.
ఇది ఇలాగే కొనసాగాలి. ఇన్నేండ్లపాటు నాపై ప్రేమాభిమానాలు చూపుతున్న అభిమానులకు ధన్యవాదాలు. వారి సపోర్ట్తో ఇంకా 70 ఏండ్లు ఇలానే కొనసాగుతాను' అని తెలిపింది.
ఇదిలా ఉంటే, నేహా ధూపియా 'నో ఫిల్టర్ నే సీజన్ 2' కార్యక్రమంలో పాల్గొన్న సోనాక్షి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. 'ఎవరినైనా చంపాలనేది
నా కోరిక'(నవ్వుతూ). అలాగే సెల్ఫీని కనిపెట్టింది కూడా నేనే అనుకుంటా. నా దగ్గర ఎప్పుడూ ఉండే డిజిటల్ కెమెరాను చుట్టూ తిప్పి చివరికి నా ఫొటో నేనే తీసుకునే దాన్ని. బహుశా అలా నేను సెల్ఫీని కనిపెట్టానని భావిస్తున్నాను' అని సరదాగా సోనాక్షి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సోనాక్షి ప్రస్తుతం 'ఇత్తేఫాక్', 'సర్కస్' చిత్రాల్లో నటిస్తోంది.