Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాను నిర్మించాలనేది మా లక్ష్యం. ఎప్పటికైనా ఆయనతో ఒక సినిమా తీస్తాం' అని అంటున్నారు నిర్మాతలు సునీత, రాజ్కుమార్ బృందావనం.
రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రేష్మాస్ బ్యానర్పై సునీత, రాజ్కుమార్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శ్రీవల్లీ'. నేడు(శుక్రవారం) ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతలు గురువారం హైదరాబాద్లో మీడియాతో ముచ్చటించారు.
భిన్నమైన సినిమా కోసం..
'చిన్నప్పట్నుంచి సినిమాలంటే పిచ్చి. మంచి సినిమా తీయాలనుకున్నాం. విజయేంద్రప్రసాద్ని కలిసి ఇప్పటి వరకు తీయనటువంటి కథతో విభిన్నమైన సినిమా తీయాలని అడిగాం. ఆయన 'శ్రీవల్లీ' కథ ఇచ్చారు. ఈ కథకు ఆయనే దర్శకత్వం వహిస్తే బాగుంటుందని అడిగితే,
'ఓకే చేస్తా' అన్నారు. అసలైతే మా అబ్బాయి అభిలాష్ను దర్శకుడిగా పరిచయం చేయాలని ఇండిస్టీలోకి వచ్చాం. ఈ చిత్రాన్ని మా అబ్బాయి డైరెక్షన్లోనే తీద్దామనుకున్నాం. కానీ విజయేంద్రప్రసాద్ ఒక ఐకాన్. ఆయన్ని నమ్మి ఈ సినిమా తీశాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మొత్తాన్ని ఆయనే ఎంపిక చేశారు. రాజమౌళి అసిస్టెంట్లు, కాంచి గారు సినిమా విషయంలో చాలా సపోర్ట్ చేశారు. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం. ఆద్యంతం సస్పెన్స్గా ఉండే మలుపులతో సాగుతుంది. కథ సంక్లిష్టంగా ఉన్నప్పటికీ సినిమాలో లవ్ ట్రాక్, సెంటిమెంట్, రొమాన్స్ ఇలా నవరసాలున్న చిత్రమిది. ఇందులోని గ్రాఫిక్ వర్క్ చాలా బాగా వచ్చింది. ఇదొక కొత్తరకమైన అనుభూతినిస్తుంది. రజత్, నేహా చాలా బాగా నటించారు. సినిమా చూశాం. చాలా సంతృప్తిగా, కాన్ఫిడెంట్గా ఉన్నాం. సినిమాలో మొదటి ఐదు నిమిషాలు చాలా కీలకం. బిజినెస్ కూడా మొత్తం అయిపోయింది. సినిమా ప్రమోషన్కు సపోర్ట్ చేసిన రామ్చరణ్, సుకుమార్, వెంకటేష్, ప్రభాస్, సురేష్బాబుకి కృతజ్ఞతలు. నేడు విడుదలవుతున్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనేది మా గోల్. ఎప్పటికైనా ఆయన అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం. నెక్ట్స్ సుకుమార్ రైటింగ్స్లో 'కుమార్ 21 ఎఫ్' టీమ్తో
ఓ సినిమా చేయబోతున్నాం' అని నిర్మాతల్లో ఒకరైన రాజ్కుమార్ బృందావనం చెప్పారు.
సినిమాపై అవగాహన చాలా ముఖ్యం
'ఈ చిత్రంలో ముందుగా పాటలు వద్దని దర్శకులు చెప్పారు. తర్వాత కథానుగుణంగా ఉంటే బాగుంటుందని పెట్టడం జరిగింది. ఐదు పాటలు, ఒక చిన్న మాంటేజ్ సాంగ్ ఉంటుంది. అవి కథలో భాగంగానే ఉంటాయి. ఈ సినిమాకు బడ్జెట్ కొంత అనుకున్నాం. ప్రారంభించాక దానికి డబుల్ అయ్యింది. మాకు బడ్జెట్పై అవగాహన లేకపోవడంతో అలా జరిగింది. గ్రాఫిక్స్కు ఎక్కువ బడ్జెట్ అయ్యింది. సినిమా తీయడంపై చాలా అనుభవం వచ్చింది. సినిమా నిర్మించాలంటే ముందుగానే ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలని తెలిసింది. మున్ముందు కూడా మంచి సినిమాలను నిర్మిస్తాం. మా రేష్మాస్ బ్యానర్కు మంచి గుర్తింపు తెచ్చే సినిమాలే తీస్తాం' అని మరో నిర్మాత సునీత తెలిపారు.