Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు, జబర్దస్త్ రాకేష్, శివారెడ్డి, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సచ్చింది రా గొర్రె'. శ్రీధర్రెడ్డి యార్వ దర్శకత్వంలో సోహామ్ రాక్స్టార్ ఎంటర్టైన్ మెంట్, ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ పతాకాలపై దీపక్ ముకుత్, ఎస్.ఎం.పాషా, అపర్ణ కిటే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో మెరవనుంది. ఆ విశేషాలను దర్శకుడు శ్రీధర్రెడ్డి తెలియజేస్తూ, 'ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం నవ్వులు పండిస్తుంది. దర్శకుడిగా ఇదే నా తొలి చిత్రమైనప్పటికీ డిఫరెంట్ జోనర్లో డార్క్ కామెడీతో తెరకెక్కిస్తున్నాం. ఇందులో అనసూయ ఓ డిఫరెంట్ పాత్ర పోషించ నున్నారు. త్వరలోనే ఆమె షూటింగ్లో పాల్గొంటారు. సినిమాకు అనసూయ పాత్ర అదనపు ఆకర్షణగా నిలుస్తుంది' అని అన్నారు. 'కథే హీరోగా నడిచే చిత్రమిది. తెలంగాణ సాంస్కృతిక గీతమైన ఒగ్గు కథ ఈ సినిమాలో ఉండటం నన్ను అమితంగా ఆకట్టుకుంది. సినిమాటిక్గా ఉంటూనే చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అన్ని వర్గాలను అలరించే చిత్రమిది' అని అనసూయ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ కుమార్, కెమెరా: రమణ సాల్వ.