Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎన్టీఆర్ చాలా బ్రిలియంట్ నటుడని చాలా మంది చెబితే విన్నాను. కానీ 'జై లవ కుశ' సినిమా షూటింగ్లో డైరెక్ట్గా చూశా. సినిమాపై ఆయనకున్న డెడికేషన్, ప్యాషన్ చూసి ఇన్స్పైర్ అయ్యాను' అని అంటోంది రాశిఖన్నా. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'జై లవ కుశ'. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాశిఖన్నా మీడియాతో మాట్లాడుతూ, 'మ్యారేజ్ బ్యూరో నడిపించే ప్రియా పాత్రలో లవ కుమార్కి పెయిర్గా నటించా. ఎన్టీఆర్ ప్రతిభ గురించి చాలా విన్నాను. ఈ చిత్రం షూటింగ్లో ప్రత్యక్షంగా చూశాను. ఆయనకున్నంత ఎనర్జీ నాకు ఉంటే బాగుండనిపించింది. ఇదే విషయం ఆయన్ని అడిగినప్పుడు 'సినిమానే జీవితం, సినిమా అంటే ప్యాషన్గా ఉంటే ఎవరైనా ఇలానే ఉంటార'ని చెప్పారు. ఒక స్టార్గా, మంచి నటుడిగా, మంచి డాన్సర్గా కంటే మంచి వ్యక్తిగా ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఆయన అద్భుతంగా నటించిన మూడు పాత్రల్లో ఏది బాగా నచ్చిందంటే చెప్పడం కష్టం. కానీ మిగతా వాటికంటే జై పాత్ర నాకు ఎక్కువగా నచ్చింది. నివేదా చాలా బాగా చేసింది. ఎన్టీఆర్తో డాన్స్ చేయడం కష్టమే అయినా బాగానే మేనేజ్ చేశాను. ఈ చిత్రంలో ఎన్టీఆర్తో కలిసి ఓ పాట కూడా పాడాల్సింది. ఆయన బిగ్బాస్ షోతో బిజీగా ఉండటంతో కుదరలేదు. మలయాళంలో నటిస్తున్న 'విలన్' చిత్రంలో ఓ పాట పాడాను. ఆ చిత్రంలో మోహన్లాల్తో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. దీంతోపాటు తమిళంలో రెండు చిత్రాలు చేస్తున్నా. తెలుగులో వరుణ్తేజ్తో 'తొలిప్రేమ'లో నటిస్తున్నా. ఇది మంచి లవ్స్టోరీ. ఇందులోనూ ఓ పాట కూడా పాడబోతున్నాను. అలాగే 'బాలకృష్ణుడు' సినిమా కోసం ఓ పాట పాడుతున్నాను. రవితేజతో 'టచ్ చేసి చూడు'తోపాటు 'రాజా ది గ్రేట్' చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో గెెస్ట్గా మెరుస్తాను. ఇప్పుడు గ్లామర్తో పాటు నటనకు స్కోప్ ఉండేలా కథానాయికలకు చూసుకోవాలి. కానీ తెలుగు సినిమాల్లో గ్లామర్, నటనను బ్యాలెన్స్ చేయడం కష్టం' అని తెలిపింది.