Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బయోపిక్..
ఇప్పుడిది బాలీవుడ్ సక్సెస్ మంత్రం. కమర్షియల్ హంగులతో వెండితెరపై దర్శనమిస్తున్న ప్రముఖుల జీవితాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే బయోపిక్ల సక్సెస్ శాతం ఎక్కువగా ఉండటంతో స్టార్స్ సైతం పోటీ పడి మరీ నటిస్తున్నారు. ఇందులో కథానాయికలూ తమదైన ముద్ర వేస్తున్నారు. స్టార్ హీరోలకు దీటుగా ముఖ్యంగా మహిళా ప్రధాన బయోపిక్స్లో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో లెక్కకు మించిన బయోపిక్లు నిర్మాణంలో ఉంటే మరికొన్ని బయోపిక్లు అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మూడు బయోపిక్స్లో అక్షరుకుమార్..
ప్రస్తుతం బాలీవుడ్లో చాలా బయోపిక్లు నిర్మాణంలో ఉన్నాయి. 'ప్యాడ్మ్యాన్', 'గోల్డ్', 'మోఘుల్' వంటి మూడు బయోపిక్ల్లో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షరుకుమార్ నటించడం విశేషం. సామాజిక వ్యవస్థాపకుడు, శానిటరీ ప్యాడ్స్ సృష్టికర్త అరుణాచలం మురుగనంథమ్ జీవితం ఆధారంగా 'ప్యాడ్మ్యాన్' సినిమాను దర్శకుడు ఆర్.బాల్కీ రూపొందిస్తున్నారు. ఇందులో అరుణాచలం పాత్రలో అక్షరు కుమార్ నటిస్తున్నారు. బయోగ్రాఫికల్ కామెడీ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సోనమ్ కపూర్, రాధికా ఆప్టే హీరోయిన్లుగా, అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో మెరనున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్షరు కుమార్ నటిస్తున్న మరో బయోపిక్ 'గోల్డ్'. స్వాతంత్య్రం వచ్చాక ఒలింపిక్లో హాకీ విభాగంలో తొలిసారి పతకం సాధించడంలో కీలక భూమిక పోషించిన ఆటగాడు బల్బీర్ సింగ్ జీవితం ఆధారంగా దర్శకురాలు రీమా కగ్తీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల కానుంది.
దీంతోపాటు 1980లో భారతీయ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన సంగీత దర్శకుడు, టీ-సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ జీవితంపై బయోపిక్ రూపొందనుంది. గుల్షన్గా అక్షరు కుమార్ నటించనున్న ఈ చిత్రానికి సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సంగీత ప్రపంచంలో గుల్షన్ విజయం సాధించిన ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కనుంది.
భిన్న ప్రముఖులు..విభిన్న నేపథ్యాలు..
ఇదిలా ఉంటే, ప్రముఖ కథానాయకుడు సంజరు దత్ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుండటం విశేషం. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజరుదత్ పాత్రలో రణ్బీర్ కపూర్ నటిస్తున్నారు. సంజరుదత్ సినీ కెరీర్, స్ట్రగుల్, వివాదాలు ఇలా అన్ని అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. సోనమ్ కపూర్, అనుష్క శర్మ, దియా మీర్జా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచ బాలల హక్కుల ఉద్యమ కారుడు, నోబల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యర్థి జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్లో బొమ్మన్ ఇరానీ నటిస్తున్నారు. ఈ చిత్రానికి బ్రహ్మానంద్ ఎస్. సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
మేథమేటీషియన్, 'సూపర్ 30' ప్రొగ్రామ్ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఓ సినిమా రాపొందనుంది. అత్యంత ప్రతిభ కలిగి, ఆర్థికంగా వెనుకబడిన 30 మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రతిష్టాత్మక ఐఐటీ, జెఈఈ పరీక్షల కోసం శిక్షణనిచ్చే ఈ కార్యక్రమంతో ఆనంద్ కుమార్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందడమే కాకుండా స్ఫూర్తిగానూ నిలిచారు. దర్శకుడు వికాస్ బాల్ తెరరూపమిచ్చే ఈ బయోపిక్లో ఆనంద్కుమార్గా హృతిక్ రోషన్ లేదా షారూఖ్ఖాన్ నటించే అవకాశం ఉంది.
అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారత వ్యోమగామి రాకేష్ శర్మ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రూపుదిద్దుకోబోతోంది. రాకేష్ శర్మగా అమీర్ ఖాన్ నటించనున్నారు. మహేష్ మతాయి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. వీటితోపాటు ఒలింపిక్లో షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన అభినవ్ బింద్రా జీవితంపై కూడా ఓ బయోపిక్ రానుంది. కన్నాన్ ఐయార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా హర్షవర్థన్ కపూర్ ఇందులో అభినవ్ బింద్రా పాత్రను పోషించనున్నారు.
అలాగే గతేడాది పారాలింపిక్లో షాట్పుట్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన దీపా మాలిక్ జీవితం ఆధారంగా ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వాని ఓ బయోపిక్ను రూపొంచబోతున్నారు. కవి, లిరిసిస్ట్ సాహిర్ లుదియన్వి జీవితం ఆధారంగా జాస్మీట్ రీనా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. సంజరు లీలా భన్సాలీ నిర్మించే ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ నటించనున్నారు. హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవిత స్ఫూర్తితో రూపొందబోతున్న చిత్రంలో పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్ నటించనున్నారు. చెన్నైకి చెందిన టెన్నిస్ ఛాంపియన్, 'అక్టోపస్సీ', 'స్టార్ ట్రెక్ 4' చిత్రాల్లో నటించిన నటుడు విజరు అమృత్రాజ్ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ను తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
స్టార్ హీరోలకు దీటుగా..
స్టార్ హీరోలకు దీటుగా వారికి ఏమాత్రం తీసిపోని రీతిలో బయోపిక్స్లో ముఖ్యంగా ప్రముఖ మహిళా బయోపిక్స్లో స్టార్ హీరోయిన్లు సైతం నటించడం హర్షించదగ్గ పరిణామం. ఈ తరహా బయోపిక్లలో ప్రధానంగా 'హసీనా పార్కర్', 'పద్మావతి', 'మణికర్ణిక' చిత్రాలు ఇప్పటికే చిత్రీకరణలో ఉండటం మరో విశేషం.
మూడు బయోపిక్స్లో దీపికా పదుకొనె..
చిత్తూరు మహారాణి 'పద్మావతి' జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని,
దానికి కొన్ని కల్పిత అంశాలను మేళవించి దర్శకుడు సంజరు లీలా భన్నాలీ 'పద్మావతి' పేరుతో ఓ హిస్టారికల్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 13, 14వ శతాబ్ద మధ్య కాలంలో సింఘల్ (శ్రీలంక) రాజ్యాన్ని పాలించిన రాజు రతన్ సేన్ భార్య, యువరాణి పద్మావతి. దీపికా పదుకొనె పద్మావతిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె భర్త రతన్ సేన్గా షాహిద్ కపూర్, ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్లో విడుదల కానుంది. వెండితెర విజువల్ వండర్స్కి కేరాఫ్గా నిలిచిన భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ముంబాయి మాఫియా క్వీన్ సప్నా దీదీ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రాబోతోంది. 1980లో సప్నా దీదీ ముంబయిని గడగడలాడించింది. ఆమె జీవితాన్ని బేస్ చేసుకుని విశాల్ భరద్వాజ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో సప్నా దీదీ పాత్రలో దీపికా పదుకొనె నటించనుంది. క్రీడాకారుల బయోపిక్లకు ఇటీవల మరింత క్రేజ్ పెరిగింది. స్ఫూర్తివంతమైన మహిళలపై వచ్చే బయోపిక్స్ సైతం అనూహ్యంగా విజయాన్ని సాధిస్తుండటంతో అలాంటి సినిమాలు మరిన్ని తెరరూపం దాల్చుకుంటున్నాయి. వీటిల్లో భాగంగా ఒలింపిక్లో సిల్వర్ మెడల్ సాధించిన ప్రముఖ బాట్మిింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ జీవితం ఆధారంగా నటుడు సోనూసూద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోనూ దీపికా పదుకొనె నటించనుంది.
బయోపిక్స్ బాటలో కథానాయికలు..
ఝాన్సీ రాణి లక్ష్మిబాయి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని దర్శకుడు క్రిష్ 'మణికర్ణిక' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదే పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది.
'భజరంగీ భాయిజాన్' చిత్రకథా రచయిత విజయేంద్రప్రసాద్ అందించిన కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రాజైన తన భర్త చనిపోవడంతో రాజ్య బాధ్యతను తనపై వేసుకుని ఆ రాజ్యాన్ని లక్ష్మిబాయి పరిపాలించింది. ప్రస్తుతం భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారత మహిళా వ్యోమగామి కల్పనా చౌవ్లా జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో ప్రియాంక చోప్రా నటించనున్నట్లు సమాచారం. గతంలో సిల్క్స్మిత జీవితం స్ఫూర్తితో రూపొందిన 'డర్టీపిక్చర్'లో నటించి మెప్పించిన విద్యా బాలన్.. రచయిత కమలాదాస్ జీవితం ఆధారంగా రూపొందనున్న ఓ చిత్రంలో నటించనుంది.
బాలీవుడ్లో మాఫియా చిత్రాలకు మంచి ఆదరణే ఉంది. మాఫియాపై గతంలో వచ్చిన చిత్రాలు మంచి ఆదరణ పొందడంతోపాటు కమర్షియల్గానూ సత్తా చాటడమే అందుకు కారణం. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో 'హసీనా పార్కర్' అనే చిత్రం తెరకెక్కింది. హసీనాగా శ్రద్ధా కపూర్ నటించిన ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని హసీనా పాత్రను పండించడం కోసం శ్రద్ధా చాలా రిస్క్ చేసింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. మరో బాట్మిింటన్ క్రీడాకారిణి, లండన్ ఒలింపిక్లో కాంస్య పతకాన్ని సాధించిన సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రాబోతోంది. ఇందులో సైనా నెహ్వాల్గా శ్రద్ధా కపూర్ మెరవనున్నారు. అందుకోసం ఇప్పటికే బాట్మిింటన్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసింది శ్రద్ధా.
ఈ చిత్రానికి అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగులోనూ బయోపిక్స్..
స్వాతంత్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా 'సైరా.. నరసింహారెడ్డి' చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవి కథానాయకుడిగా ఈ చిత్రాన్ని సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మిస్తున్నారు. అలనాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా
మరో బయోపిక్ రూపొందుతోంది. కీర్తిసురేష్ ప్రధాన పాత్రధారిణిగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ప్రముఖ బాట్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రూపొందనుండటం విశేషం.