Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీమురళి, రచితారామ్ జంటగా కన్నడలో విడుదలై ఘన విజయం సాధించిన 'రథావరం' చిత్రాన్ని ధర్మశ్రీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై మంజునాథ్.ఎన్ ఈ నెల 1వ తేదీన తెలుగులో విడుదల చేశారు. ఇదిలా ఉంటే, త్వరలోనే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఆ విశేషాలను నిర్మాత మంజునాథ్.ఎన్ తెలియజేస్తూ, 'కన్నడలో భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రమిది. అక్కడ భారీ కలెక్షన్లను రాబట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకుంది. కొత్త కాన్సెప్ట్తో రూపొందిన చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో రాజీపడకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనువదించి సెప్టెంబర్ 1న విడుదల చేశాం. ఇక్కడ మంచి రివ్యూలు రాబట్టుకున్నప్పటికీ అదే రోజున పెద్ద సినిమాలు విడుదలవడంతో డిస్ట్రిబ్యూటర్స్ అనుకున్న థియేటర్స్లో సినిమాను విడుదల చేయలేకపోయారు. దీంతో ఆ ఒక్క రోజు మాత్రమే సినిమాను ప్రదర్శించాం. డిస్ట్రిబ్యూటర్ల సలహా మేరకు పెద్ద సినిమాలు లేని టైమ్లో మళ్ళీ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.