Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, షాలిని పాండే, ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, కీలక పాత్ర కోసం మోహన్బాబును ఎంపిక చేశారు. ప్రియాంక దత్ నిర్మిస్తున్న
ఈ చిత్ర విశేషాలను దర్శక,నిర్మాతలు తెలియజేస్తూ, 'సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న ఈ చిత్రంలో జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ మెరవనున్నారు. తాజాగా ఇందులో మరో మహానటుడు మోహన్బాబు చేరారు. విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్బాబు కనిపించనున్నారు. అక్టోబర్ చివర్లోగాని, నవంబర్ మొదటి వారం నుంచిగానీ ఆయన షూటింగ్లో పాల్గొంటారు. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ మోహన్బాబుగారి స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పాలకొల్లులో జరుగుతోంది. త్వరలోనే ఫస్ట్లుక్ను విడుదల చేయనున్నాం' అని చెప్పారు.