Authorization
Mon Jan 19, 2015 06:51 pm
100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' దగ్గర్నుంచి సినిమాల విషయంలో బాలకృష్ణ స్పీడు పెంచారు. ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపేస్తున్నారు. 101గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'పైసా వసూల్'లో నటించిన బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో 102వ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత 103వ సినిమాను తేజ దర్శకత్వంలో చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట.
ఇటీవల 'నేనే రాజు నేనే మంత్రి' వంటి పొలిటికల్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించి అదిరిపోయే హిట్ను తేజ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత కొద్ది కాలంగా ఎన్టీఆర్ జీవితంపై సినిమా చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. స్క్రిప్ట్ రెడీగా ఉన్న ఈ చిత్రాన్ని తేజ దర్శకత్వంలో చేయాలని బాలకృష్ణ యోచిస్తున్నారట. ఇదే విషయంపై ఇటీవల తేజతోనూ బాలయ్య చర్చించారట. అన్ని కుదిరితే వచ్చే ఏడాది
ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో బాలయ్య సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.