Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దినేష్, మియా జార్జ్, రిత్విక హీరోహీరోయిన్లుగా నెల్సన్ వెంకటేశం దర్శకత్వంలో సినియోగ్ మోషన్ పిక్చర్స్ పతాకంపై సురేష్ బల్లా, మృదుల నిర్మిస్తున్న చిత్రం 'పెళ్లిరోజు'. ఈ చిత్రంలోని పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఆ వివరాలను నిర్మాతలు తెలియజేస్తూ, 'జీవితంలో పెళ్లిరోజు చాలా ముఖ్యమైనది.
అది అందరికీ మరపురాని రోజుగా మిగిలిపోతుంది. నేటి సమాజంలో పెళ్లి విషయంలో యువత ఎదుర్కొనే సమస్యలకు ఈ చిత్రం ప్రతిబింబంగా నిలుస్తుంది. మంచి సందేశాత్మకంగా
ఈ చిత్రాన్ని రూపొందించాం. పాటలు అర్థవంతంగా ఉంటాయి. అందరినీ అలరిస్తాయి. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 25న మాజీ సీఎం, మాజీ గవర్నర్ డా||కె.రోశయ్య అతిథిగా హైదరాబాద్లో నిర్వహించనున్నాం. ఈ సభకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా||కె.వి.రమణాచారి అధ్యక్షత వహిస్తారు. 1968లో 'పెళ్లిరోజు' చిత్రంలో నటించిన జమున ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు' అని అన్నారు. 'ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమవుతుంది. ఒక మంచి సినిమా తీశామన్న తృప్తి ఉంది' అని దర్శకుడు నెల్సన్ వెంకటేశం చెప్పారు.