Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు వంశీ, అక్షర జంటగా బొండా వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో లెంకల అశోక్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'గులాబీ మేడ'. సాకేత్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఆడియో బిగ్ సీడీని ప్రతాని రామకృష్ణగౌడ్, పాటల సీడీని నటి కవిత విడుదల చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, 'పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయి. రొమాన్స్, హర్రర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే నిర్మాత అశోక్రెడ్డి మరిన్ని చిత్రాలు నిర్మిస్తారు. కొత్తవాళ్లు ఇండిస్టీకి రావాలి. ఇండిస్టీ కళకళలాడుతుంది' అని అన్నారు. 'గులాబి పేరుతో వచ్చిన చిత్రాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఈ చిత్రం కూడా సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాం. కంటెంట్ బాగుంటే చిన్న సినిమానే పెద్ద బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని ఈ మధ్య విడుదలైన సినిమాలు నిరూపించాయి. చిన్న సినిమాకు థియేటర్ల సమస్య ఉంది.
ఈ చిత్రానికి థియేటర్ల విషయంలో మా వంతు సహకారాన్ని అందిస్తాం. ప్రమోషన్ బాగా చేయాలని దర్శకనిర్మాతలను కోరుతున్నా' అని ఆర్కేగౌడ్ చెప్పారు.
దర్శకుడు చెబుతూ, 'లవ్, హర్రర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇందులో నిర్మాత అశోక్రెడ్డి కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. తప్పకుండా సినిమా అందరినీ అలరిస్తుంది' అని చెప్పారు. 'చిన్న సినిమా తీసి నిరూపించుకోవాలని ఈ చిత్రాన్ని ప్రారంభించాం. కానీ పెద్ద సినిమాలా రూపొందించాం. నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించాం. సినిమా పూర్తవడానికి నా మిత్రులు ఎంతో మంది సహకరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను అక్టోబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాత అశోక్రెడ్డి అన్నారు.