Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెరీర్ తొలినాళ్ల నుంచి వైవిధ్యమైన పాత్రలే చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది సోనమ్ కపూర్. 'నీర్జా' చిత్రంతో జాతీయ అవార్డునూ అందుకుంది. ప్రస్తుతం మూడు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె తాజాగా మరో రెండు కొత్త ప్రాజెక్ట్లకు
గ్రీన్ సిగల్ ఇవ్వడం విశేషం. ఆ విషయాన్ని సోనమ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం నటిస్తున్న 'ప్యాడ్మ్యాన్', సంజరు దత్ బయోపిక్, 'వీర్ డి వెడ్డింగ్' చిత్రాలు
ఈ ఏడాదిలో లేదా వచ్చే ఏడాదిలోగాని రిలీజ్ అవుతాయి. వచ్చే ఏడాది మరో రెండు చిత్రాలు ప్రారంభించబోతున్నాం. అవి చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి. త్వరలో వాటికి సంబంధించి అధికారికంగా ప్రకటిస్తాం. రాబోయే నా చిత్రాలు ప్రేక్షకుల్ని ఎట్టిపరిస్థితుల్లో నిరుత్సాహ పరచవు' అని చెప్పింది.