Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఉగ్రవాదమంటే అభం శుభం తెలియని జనాల్ని చంపడమే కాదు, యువతను పెడదోవ పట్టించడం కూడా. అటువంటి అతీత శక్తుల్ని సమాజం నుంచి బహిష్కరించడమే ఎన్ఐఏ పని. ఇదే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమే 'పిఎస్వి గరుడవేగ 126.18ఎం'' అని అన్నారు నిర్మాత కోటేశ్వరరాజు. రాజశేఖర్, పూజా కుమార్ జంటగా కిషోర్, శ్రద్ధాదాస్, అదిత్ కీలక పాత్రధారులుగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పిఎస్వి గరుడవేగ 126.18ఎం'. శివాని శివాత్మక ఫిల్మ్స్ సమర్పణలో, జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో చిత్ర టీజర్ను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ, 'నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. బలమైన కథ, పాత్రలకు నటీనటులు ప్రాణం పెట్టి నటించారు. హై టెక్నికల్ వ్యాల్యూస్తో రూపొందించిన ఈ చిత్రానికి అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెట్స్, స్టంట్స్, యాక్షన్ ఎలిమెంట్స్ దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ల కోసం హేవీ క్రేన్స్, ఇండిస్టీయల్ ట్రక్స్ను ఉపయోగించాం. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కనిపించే వ్యక్తిగా రాజశేఖర్, ఆయన భార్యగా పూజా కుమార్ పాత్రలు ఇందులో ఆసక్తికరంగా ఉంటాయి. జర్నలిస్ట్గా శ్రద్ధాదాస్, ప్రత్యేక గీతంలో సన్నీలియోన్, ఇప్పటి వరకు చేయని పాత్రలో పృథ్వీ, రాజకీయ నాయకులుగా పోసాని, షియాజీ షిండే ఆకట్టుకుంటారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఇప్పటికే పోస్టర్ల రూపంలో విడుదల చేసిన క్యారెక్టర్లకు మంచి స్పందన లభించింది. ఈ వారంలోనే టీజర్ను విడుదల చేస్తాం. అదే రోజు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తాం' అని అన్నారు.