Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమా హీరో,హీరోయిన్లుగా జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో ఆర్.స్టూడియోస్, విజరు ఆంటోని కార్పొరేషన్ పతాకాలపై రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజరు ఆంటోని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఇంద్రసేన'. ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ''నకిలి', 'డా||సలీం'లతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న విజరు ఆంటోని 'బిచ్చగాడు'తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తర్వాత 'భేతాళుడు', 'యెమన్' చిత్రాలతో కమర్షియల్ హీరోగా సక్సెస్ సాధించారు. వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్లతో తనకంటూ ఓ మార్క్ సృష్టించుకున్న విజరు ఆంటోని హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. 'బిచ్చగాడు'లో మదర్ సెంటిమెంట్కు తన అద్భుతమైన నటనను జోడించి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన ఆయన ఈ చిత్రంలో బ్రదర్ సెంటిమెంట్తో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల చిరంజీవిగారు విడుదల చేసిన ఫస్ట్లుక్కు మంచి స్పందన వచ్చింది. హై ఎమోషన్స్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే ఆడియో విడుదల చేసి, ఆ వెంటనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్, రింధు రవి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం, ఎడిటింగ్: విజరు ఆంటోని, సినిమాటోగ్రఫీ: కె.దిల్రాజ్, ఆర్ట్: ఆనంద్ మణి.