Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మహానుభావుడు'. థియేట్రికల్ ట్రైలర్తోపాటు ఈ చిత్రంలోని పాటల ప్రదర్శన సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ, 'నేను బాగా ఎంజారు చేసిన పాత్ర ఇది. నా కెరీర్లో ఇలాంటి పాత్రను చేయలేదు. ఇలాంటి స్క్రిప్ట్ కూడా మళ్ళీ వస్తుందని అనుకోవడం లేదు. సినిమా ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందింది. ఈ నెల 29న విడుదల కాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుంది' అని అన్నారు. 'ఈ చిత్రాన్ని ఎప్పుడో విడుదల చేయాలనుకున్నాం. మధ్యలో హాలీడేస్ రావడంతో వద్దని అనుకున్నాం. దసరా పండుగకి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా వస్తే బావుంటుందని నిర్మాతలు అనడంతో సినిమాను సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నాం. హీరో శర్వానంద్, మెహరీన్తోపాటు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మంచి ఎఫర్ట్ పెట్టి సినిమా కోసం పనిచేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు, కుటుంబం అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. ఇందులో శర్వానంద్ కొత్తలుక్లో కనిపిస్తారు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ సినిమా అలరిస్తుంది' అని దర్శకుడు మారుతి తెలిపారు. హీరోయిన్ మెహరీన్ చెబుతూ, 'ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. చాలా మంచి క్యారెక్టర్ చేశాను. మారుతి చాలా చక్కగా డైరెక్ట్ చేశారు. కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. ఆదరించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెమినీ సురేష్, మధుమణి, బాలు, ఎస్.కె.ఎన్, వంశీ, ప్రమోద్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.