Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మహానటులు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్, నటసామ్రాట్ డా|| అక్కినేని నాగేశ్వరరావుగారు రచించిన 'అక్కినేని ఆలోచనలు' పుస్తక అనువాదాల ఆవిష్కరణోత్సవ కార్యక్రమం ఈ నెల 23న నిర్వహించబోతున్నాం' అని రసమయి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా||ఎం.కె.రాము తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'కళ ద్వారా సమాజ సేవ ధ్యేయంతో గత 48సంవత్సరాలుగా ఉత్తమ కళాత్మక విలువలతో, ఉన్నత ప్రమాణాలతో, విలక్షణ కార్యక్రమాలతో, వేలాది కార్యక్రమాలను తీర్చిదిద్దిన స్వచ్ఛంద కళాసంస్థ 'రసమయి'. గత 36 సంవత్సరాలుగా అన్ని కార్యక్రమాలతోపాటు, ప్రత్యేకంగా డా||అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినోత్సవ కార్యక్రమాలను నిర్వహించి గత సంవత్సరం నుంచి వారి జయంతి ఉత్సవాలను కూడా అదే స్థాయిలో నిరాఘాటంగా నిర్వహించాలని సంకల్పించాం. అందులో భాగంగానే తాజాగా 'అక్కినేని ఆలోచనలు' పుస్తక అనువాదాలను ఈ నెల 23న సాయంత్రం 6గంటలకు హైదరాబాద్లోని, నాంపల్లిలో గత తెలుగు విశ్వ విద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో వైభవంగా జరుపనున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ సీఎం డా||కె.రోశయ్య విచ్చేయనుండగా, సన్మాన కర్తగా కళాబంధు డా||టి.సుబ్బరామిరెడ్డి, సభా ప్రారంభకులుగా శ్రీమండలి బుద్ధ ప్రసాద్, సభాధ్యక్షులుగా పద్మభూషణ్ డా||యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఆత్మీయ అతిథులుగా రచయిత్రి డా||కె.వి.కృష్ణకుమారి, ప్రముఖ దంత వైద్య నిపుణులు డా||ఎ.ఎస్, నారాయణ్గారు, సత్కార స్వీకర్తలుగా డా||బి.వాణి, డా||సత్యశ్రీ పాల్గొననున్నారు.