Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రీడాకారులపై తెరకెక్కే బయోపిక్లకు మంచి క్రేజ్ ఉంటోంది. ముఖ్యంగా క్రికెట్ నేపథ్యంలో ధోని, సచిన్లపై వచ్చిన బయోపిక్ చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. తాజాగా మహిళా టీమ్ ఇండియా ఆల్ రౌండర్, ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామిపై బయోపిక్ రాబోతుంది. బాలీవుడ్ దర్శకుడు సుశాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె జీవితం ఆధారంగా 'చక్దాహా ఎక్స్ప్రెస్' చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలిపారు. 'ఝులన్ గోస్వామి పాత్ర పోషించే నటి కోసం వెతుకుతున్నాం. సినిమా కోసం సంతకం చేసే వరకూ పేరు వెల్లడించలేం. ఓ బాలీవుడ్ నటితో ఈ చిత్రాన్ని తీయాలని భావిస్తున్నాం' అని దర్శకుడు సుశాంత తెలిపారు. ఇటీవల ఇంగ్లాండ్లో ముగిసిన మహిళల ప్రపంచ కప్లో బెంగాల్కు చెందిన ఝులన్ గోస్వామి అద్భుతమైన ప్రదర్శనతో భారత్ జట్టు ఫైనల్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు.