Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాల్ హీరోగా నటించిన 'పందెంకోడి' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు విదితమే. లింగుస్వామి దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ చిత్రం అటు తమిళం, ఇటు తెలుగులో బ్లాక్బస్టర్గా నిలిచింది. విశాల్ కెరీర్లో మైలురాయి చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతుంది. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రం బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమాల్లో హీరో విశాల్, దర్శకుడు లింగుస్వామితోపాటు కీలక పాత్ర పోషించిన రాజ్కిరణ్ పాల్గొన్నారు. ఈ చిత్రంలో విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించనుంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించనుంది. విశాల్ దీంతోపాటు 'విలన్', 'ఇరుంబు థిరై', 'కరుప్పు రాజా వెల్లై రాజా' చిత్రాల్లో నటిస్తున్నారు.