Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు, సమంత, కాజల్, నిత్యా మీనన్ హీరోహీరోయిన్లుగా అట్లీ దర్శకత్వంలో తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ పతాకంపై మురళీ రామస్వామి, హేమా రుక్మిణి సంయుక్తంగా తమిళంలో నిర్మిస్తున్న 'మెర్సల్' చిత్రాన్ని తెన్నాండల్ స్టూడియోస్తో కలిసి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత శరత్ మరార్ తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదల చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి శరత్ మరార్ మాట్లాడుతూ, 'విజరు నటిస్తున్న 61వ చిత్రమిది. అలాగే తెన్నాండల్ స్టూడియోస్లో వందవ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ బ్యానర్తో అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. 'బాహుబలి', 'భజరంగీ భాయిజాన్' వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే అందించడం విశేషం. ఇండియాలోని పలు ప్రాంతాలతోపాటు యూరప్లోని అందమైన లొకేషన్లలో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. త్వరలో తెలుగు టీజర్, ఆడియోను విడుదల చేసి, దీపావళికి సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఇదొక లాండ్మార్క్ చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. ''కాటమరాయుడు', 'సర్దార్ గబ్బర్ సింగ్' లాంటి భారీ చిత్రాలు నిర్మించిన శరత్ మరార్కి టీవీ ఇండిస్టీలో మంచి పేరుంది. ఆయన ఈ ప్రాజెక్ట్లో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహ్మాన్ ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలను సమకూరుస్తున్నారు. తెలుగులో దీపావళికి గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నాం' అని నిర్మాత మురళీ రామస్వామి తెలిపారు. ఎస్.జె.సూర్య కీలక పాత్రధారుడిగా, వడివేలు, కోవై సరళ, సత్యన్, సత్యరాజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: జి.కె.విష్ణు, ఎడిటర్: రుబన్.