Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, సమంత, సీరత్ కపూర్ ప్రధాన పాత్రధారులుగా ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, మాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'రాజుగారి గది 2'. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ను బుధవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, 'నాన్నగారు(ఏఎన్నార్) మన మధ్యలేరు అనడం తప్పు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. అబ్బూరి రవి, సినిమాటోగ్రాఫర్ దివాకరన్, సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి పెట్టిన ఎఫర్ట్ ఎక్స్ట్రార్డినరీ. వీరికి నా అనుభవంతో చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చాను. ఈ ట్రైలర్కు ముందు ఓ ట్రైలర్ను చూపించారు. అది నచ్చలేదు. దీంతో దర్శకుడు ఓంకార్ ఒక రోజు సమయం తీసుకుని ఈ ట్రైలర్ను తయారు చేశారు. ఇందులో థమన్ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది. సినిమాకది పెద్ద అస్సెట్ అవుతుంది. అందరం ఇష్టంతో ఎంతో కష్టపడి సినిమా చేశాం. ఇందులో నేను మెంటలిస్ట్గా కనిపిస్తాను. కేరళలోని ఓ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని ఈ పాత్రను డిజైన్ చేశాం. అతనితో నేను కూడా మాట్లాడాను. మనం ఏమనుకుంటామో అతను ఇట్టే చెప్పేయగలడు. ఆ పాత్రలో ఎంతో ఇష్టపడి నటించాను. సినిమా చేస్తున్నంత సేపు ఎగ్జైటింగ్గా అనిపించింది. సినిమా కోసం ఓంకార్ నన్ను ఏడిపించాడు. ఇందులో సమంత, సీరత్లలో ఎవరు దెయ్యమనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అదొక థ్రిల్లింగ్ ఎలిమెంట్. షకలక శంకర్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ బాగా హాస్యాన్ని పండించారు. పీవీపీగారు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. విజువల్గా సినిమా సూపర్గా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పూర్తి కాలేదు. అవి వచ్చాకే డబ్బింగ్ చెబుతానని చెప్పా. అక్టోబర్ 13 కోసం వెయిట్ చేస్తున్నాం. నాకు ఈ చిత్రం కొత్త జోనర్ అవుతుంది' అని అన్నారు. 'రెండేండ్ల క్రితం సెప్టెంబర్ 15న 'రాజుగారి గది' ట్రైలర్ విడుదల చేశాం. ఇప్పుడు సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జయంతి రోజు 'రాజుగారి గది 2' ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ కథ విన్న ఐదు నిమిషాల్లోనే ఇందులో నటించేందుకు నాగార్జునగారు ఓకే చెప్పారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేసుకుంటానని భావిస్తున్నా. నాకు నాగార్జునగారంటే అభిమానం. ఒక దర్శకుడిలా కాకుండా అభిమానిగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశా. 'శివ' చిత్రంలోని చైన్ను స్ఫూర్తిగా తీసుకుని ఈచిత్రంలో రుద్రక్షమాల సీన్ను డిజైన్ చేశాం. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం నాకిచ్చిన సపోర్ట్ మరువలేనిది' అని దర్శకుడు ఓంకార్ తెలిపారు. నిర్మాత పీవీపీ తెలుపుతూ, 'నాగార్జున గారితో మా బ్యానర్లో 'ఊపిరి' సినిమా చేశాం. అంతకంటే పెద్ద కమర్షియల్ సినిమా చేయాలని ఈ చిత్రాన్ని ప్లాన్ చేశాం. నాగార్జునగారు హీరోగానే కాకుండా ఈ చిత్రంలోని అన్ని విభాగాల్లో ఇన్వాల్వ్ అయి చేశారు. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో థమన్, సీరత్, అబ్బూరి రవి, మధు, జగన్, దివాకరన్ తదితరులు పాల్గొన్నారు.