Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్బాబు, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి. ఆర్.సినిమా ఎల్.ఎల్.పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఎన్.వి. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'స్పైడర్'. ఈ చిత్ర నెల్లూరు ఏరియా హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత జి.హరి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత హరి మాట్లాడుతూ, ''స్పైడర్' వంటి ప్రతిష్టా త్మక ప్రాజెక్స్ను మా హరి పిక్చర్స్ ద్వారా నెల్లూరు ఏరియాలో విడుదల చేయబో తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 27న తెలుగు, తమిళంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే అత్యధిక థియే టర్లలో భారీ స్థాయిలో నెల్లూరు ఏరియాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నా. ఈ అవకాశాన్నిచ్చిన మహేష్బాబుగారికి, మురుగదాస్కి, ఎన్.వి.ప్రసాద్కి కృతజ్ఞతలు. అందరిని అలరించే చిత్రమవుతుంది' అని అన్నారు.