Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలీరాజా, మధుమితకృష్ణ జంటగా గిరిధర్ దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఎం.సుబ్బలక్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'నా రూటే సెపరేటు'. గురువారం హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు గిరిధర్ మాట్లాడుతూ, 'ఈజీ మనీ నేపథ్యంలో సాగే చిత్రమిది. నేటి తరం యువతీయువకులు సులభంగా డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటున్నారు? ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆసక్తికరమైన కథ, కథనాలతో సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ఇది అన్ని వర్గాలను మెప్పించే చిత్రమవుతుందని నమ్ముతున్నాం' అని అన్నారు. 'సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియోను విడుదల చేసి, ఆ వెంటనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని వి.వి.వామనరావు తెలిపారు. కథానాయిక మధుమితకృష్ణ చెబుతూ, ''లజ్జ' చిత్రం తర్వాత నేను నటిస్తున్న చిత్రమిది. నటనకు ఆస్కారం ఉంటుంది. సులభంగా డబ్బు సంపాదించడం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడే పాత్రలో కనిపిస్తాను. భిన్న పార్శ్వాలుండే పాత్ర నాది' అని చెప్పారు. అలీరాజా, జెన్నీఫర్, ప్రసాద్బాబు, శేషు వెంకీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎన్.సుధాకర్రెడ్డి, సంగీతం: నందనరాజ్ బొబ్బిలి, ఎడిటింగ్: శివగుంటూరు.న