Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ నటించే సినిమాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన సుజిత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు మరో ప్రాజెక్ట్కు కూడా గతంలోనే గ్రీన్ సిగల్ ఇచ్చారు ప్రభాస్. 'జిల్' వంటి హిట్ చిత్రాన్ని రూపొందిం చిన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం లవ్ స్టోరీ నేపథ్యంలో సాగుతుందటం ఓ విశేషమైతే, యూరప్ బ్యాక్డ్రాప్లో 1960, 70 టైమ్లో ఈ ప్రేమ కథ నడుస్తుండటం మరో విశేషం. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతమందించనున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ స్ట్రయిట్ హిందీ సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 'బాహుబలి 2' తర్వాత పలువురు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రభాస్తో సినిమా చేసేందుకు ఆసక్తిచూపించారు. కొన్ని ఆఫర్లు కూడా ప్రభాస్ వద్దకు వచ్చాయి. కానీ దేనికీ ఆయన ఓకే చెప్పలేదు. ప్రస్తుతం నటిస్తున్న 'సాహో' చిత్న్రాన్నే తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కిస్తున్నారు. కానీ నెక్ట్స్ హిందీలో స్ట్ట్రయిట్ చిత్రం చేసేందుకు ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్నారట. ఇటీవల వస్తున్న ఆఫర్ల విషయంలో ప్రభాస్ సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కథా చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. మరి ఏ దర్శకుడితో సినిమా చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 'సాహో' చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుండగా యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత భారీ సాంకేతిక నైపుణ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.