Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఖైదీ నంబర్ 150' వంటి భారీ బ్లాక్బస్టర్తో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన 151వ చిత్రంగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్లుక్ను విడుదల చేశారు. 'ధృవ' వంటి హిట్ చిత్రాన్ని అందించిన సురేందర్రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో బిగ్బి అమితాబ్ బచ్చన్, తమిళ హీరో విజరు సేతుపతి, కన్నడ హీరో సుదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అంతర్జాతీయ టెక్నీకల్ స్టాండర్డ్లో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా సమాచారం మేరకు అక్టోబర్ 20న సెట్స్పైకి వెళ్ళనుందట. అందుకోసం హైదరాబాద్లో భారీ సెట్స్ వేస్తున్నారని తెలుస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహారెడ్డి జీవిత చరిత్ర నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం ఆనాటి పరిస్థితులు ప్రతిబింబించేలా నానక్ రామ్ గూడాలోని స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఓ ప్రత్యేక సెట్ను డిజైన్ చేస్తున్నారట. ఇది సినిమాకు హైలైట్గా నిలవనుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.