Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులకు శుక్రవారం ఎఫ్డీసీ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మెన్ రామ్మోహనరావు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'సినీ జర్నలిస్ట్లకు ఎఫ్డీసీ పరంగా సహకరిస్తాం. ప్రస్తుతం ఎల్ఎల్పి పేరుతో కొంత మంది నిర్మాతలు మోనోపాలిగా మారారనే విమర్శలు వస్తున్నాయి. మీడియా అందరికీ తగిన విధంగా వ్యాపార ప్రకటనలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. దసరా నుంచి థియేటర్లలో ఐదు ప్రదర్శనలకు అనుమతి వస్తుంది. రాష్ట్రంలోని ప్రతి మండలానికి థియేటర్ ఉండేలా, బాలల చిత్రాలు నిర్మించే వారికి ప్రోత్సాహంగా ఇచ్చే 15లక్షల సబ్సిడీని రెండింతలు పెంచేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర స్థాయిలో ప్రతి ఏటా ఇచ్చే అవార్డుకు ఇంకా పేరు నిర్ణయించలేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తగినట్టు తెలంగాణ సినిమాకు ప్రత్యేక గుర్తింపు విషయంలో నియమ, నిబంధనలను అనుగుణంగా ఆలోచిస్తాం.
ఆన్లైన్ టిక్కెట్ విషయంలో ఇప్పటికే టెండర్ల ప్రకియ పూర్తయింది. త్వరలోనే ఆ నిర్ణయాలను ప్రకటిస్తాం. హైదరాబాద్లో అన్ని భాషల చిత్రాలకు వీలుగా జాతీయ స్థాయి హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది' అని తెలిపారు.