Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా హెచ్.వినోద్ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న 'ధీరన్ అదిగారమ్ ఒండ్రు' చిత్రాన్ని ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఆదిత్య మ్యూజిక్
ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఆదిత్యా ఉమేశ్ గుప్తా నిర్మాతగా మారి తెలుగులో 'ఖాకి' పేరుతో విడుదల చేస్తున్నారు. 'ద పవర్ ఆఫ్ పోలీస్' అనేది చిత్ర ఉపశీర్షిక. ఈ సందర్భంగా నిర్మాత ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ, '2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు హెచ్.వినోద్ ఈ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఈ చిత్ర కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని సినిమా రైట్స్ తీసుకున్నాను. ఇందులో కార్తీ శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. లుక్స్, ఫిజిక్ పరంగా ఆయన చాలా కేర్ తీసుకున్నారు. తెలుగులో 'రన్ రాజా రన్', 'జిల్', 'బాబు బంగారం', 'హైపర్' తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన జిబ్రాన్ ఈ సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ నెల 27న చిత్ర టీజర్ను, అక్టోబర్ 17న ట్రైలర్, నవంబర్ 17న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాలను అలరించేలా ఈ చిత్రం ఉంటుంది' అని అన్నారు.