Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భానుచందర్, జీవా, అదిరే ఆది, ఫణి ప్రధాన పాత్రధారులుగా జంగాల నాగబాబు దర్శకత్వంలో
మెట్రో క్రియేషన్స్ పతాకంపై దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'వస్తా'. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'ప్రస్తుతం టాలీవుడ్లో హర్రర్ కామెడీ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. చిన్న చిత్రాలుగా విడుదలై పెద్ద విజయాలను సాధించిన సినిమాలెన్నో ఉన్నాయి. వాటి స్ఫూర్తితో భిన్నమైన హర్రర్ కామెడీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. దర్శకుడు జంగాల నాగబాబు చెప్పిన కథ భిన్నంగా ఉండటంతో ఈ సినిమా నిర్మాణానికి సిద్ధమయ్యాం. సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సీనియర్ హీరో భానుచందర్ సహకారం మరువలేనిది. సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో మెప్పిస్తారు. ఇది తప్పకుండా అందరినీ అలరించే సినిమా అవుతుంది' అని అన్నారు. రఘువర్మ, పిల్లా నాగేంద్ర, అబ్దుల్ రజాక్, రేణుక, జ్యోతిర్మయి, పుట్టి నాగేంద్ర, సొంఠి సుబ్రహ్మణ్యం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వాసి రెడ్డి సత్యానంద్.