Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్గా వెంకటేష్ నిలిచారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మహేష్బాబుతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్తో 'మసాల', పవన్ కళ్యాణ్తో 'గోపాల గోపాల' చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. తాజాగా మరో మల్టీస్టారర్లో నటించేందుకు రెడీ అవుతున్నారు. మేనల్లుడు నాగచైతన్యతో కలిసి సిల్వర్స్కిన్ని షేర్ చేసుకోబోతున్నారని సమాచారం. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారట. నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయన', చైతూతో 'రారండోరు వేడుక చూద్దాం' చిత్రాలతో దర్శకుడిగా తానేమిటో కళ్యాణ్కృష్ణ నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ హిట్ కోసం మల్టీస్టారర్ కథను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. వెంకీ ప్రస్తుతం ఏ చిత్రంలోనూ నటించడం లేదు. ఓ రీమేక్లో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఏదీ ఫైనల్ కాలేదు. అలాగే నాగచైతన్య ప్రస్తుతం 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్నారు.