Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను శైలజ'తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది కీర్తి సురేష్. ఆ చిత్ర విజయంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్కు చేరుకుంది. నానితో 'నేను లోకల్' అంటూ మెప్పించి ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అంతేకాదు ఇప్పుడు 'మహానటి'గాను ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయబోతోంది. అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ అశ్విన్ రూపొందిస్తున్న చిత్రం 'మహానటి'. స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంగళవారం కీర్తిసురేష్ బర్త్డే నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో కీర్తి సురేష్ కళ్ళతో పలికించే హావభావాలు, ఆమె సహజమైన అందం ఆడియెన్స్ను తప్పకుండా అలరిస్తుంది.
సావిత్రిగా ఆమె నటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆమె బర్త్డే సందర్బంగా 'ఆకాశ వీధిలో అందాల జాబిలి' అనే క్యాప్షన్తో విడుదల చేసిన పోస్టర్ను సావిత్రిగారికి అంకితం చేస్తున్నాం' అని చెప్పారు. కీర్తి సురేష్ ఈచిత్రంతోపాటు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలోనూ నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలోని కీర్తిసురేష్ లుక్ను ఆమె బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయటం విశేషం.