Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు దక్షిణాదిలో రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ కథానాయిక. వరుస విజయాలతో అతి తక్కువ టైమ్లో అగ్ర కథానాయికగా ఎదిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో నటిస్తూ బిజీగా ఉన్న రకుల్ తాజాగా సూర్య సరసన నటించే బంపర్ ఆఫర్ను అందుకుంది. సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా ఎంపికయ్యింది. సూర్య వంటి స్టార్ సరసన నటించే అవకాశం
రావడం పట్ల రకుల్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కూడా తెలిపింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ టైమ్ దొరికినప్పుడలా
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రకుల్ వంతు కృషి చేస్తోంది.బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రకుల్ చెబుతూ, 'ఆడపిల్లల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. లింగ నిర్ధారణ ద్వారా బ్రూణ హ్యతలు చేయడం చట్టరీత్యా నేరం. లింగ నిర్ధారణకు సహకరించే వారిని కఠినంగా శిక్షించాలి. అమ్మాయి, అబ్బాయి సమానమే. ఇద్దరికీ సమాన స్వేచ్ఛ ఇవ్వాలి. మహిళల అక్రమ రవాణా నివారించడంతోపాటు బాల్య వివాహాలను నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలి. కట్నం తీసుకునే వారిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి' అని తెలిపింది.