Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధార్థ్, ఆండ్రియా జంటగా సిద్ధార్థ్, వయూకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఎటాకి ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం 'గృహం'. మిలింద్రావ్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ఈనెల 17న విడుదల కానుంది.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఈ చిత్ర స్పెషల్ ప్రీమియర్ షో జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కథానాయకుడు సిద్ధార్థ్ మాట్లాడుతూ,'ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకున్నాం. కొన్ని కారణాలతో కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేస్తున్నాం. హర్రర్ జోనర్లో సినిమా చేయాలని డిసైడ్ అయినప్పుడు ఈ చిత్రం కోసం చాలా విషయాలు రీసెర్చ్ చేశాం. ఈ రీసెర్చ్లో చాలా కొత్త విషయాలు తెలిశాయి. దేవుడు, దెయ్యం ఉన్నాయా? లేదా అనేవి వ్యక్తిగత విషయాలు. అయితే మేం రీసెర్చ్ చేసిన విషయాల్లో 60 శాతం నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని, వాటికి డ్రమటిక్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కలర్ టోన్తోపాటు టెక్నికల్గా అన్ని విషయాల్లో కేర్ తీసుకున్నాం. ప్రస్తుతం హర్రర్ చిత్రాలు ఎక్కువైపోయాయి. ఇలాంటి తరుణంలో ఓ పూర్తి స్థాయి హర్రర్ సినిమా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈచిత్రాన్ని చేశాం.
ఓ నిర్మాతగా ఈచిత్రాన్ని నేను బాగా ఇష్టపడుతున్నాను. అలాగే ప్రేక్షకులు కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను' అని చెప్పారు. 'సమాజంలో చాలా ప్రమాదకరమైన మనుషులున్నారు.
అలాంటి వారిని చూపించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాం' అని దర్శకుడు చెప్పారు.'ఇందులో సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. ఇతర చిత్రాలతో పోలిస్తే చాలా వైవిధ్యంగా, వినూత్నంగా ఉండేందుకు ప్రయత్నించాను' అని సంగీత దర్శకుడు గిరీష్ వాసుదేవన్ చెప్పారు.